తిరుపతి నగరంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ భరతనాట్యం కళాకారిణి కడియాల వాణి చంద్రను రాయలసీమ రంగస్థలి ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.