ATP: రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం పరిశీలించారు. 2017లో టీడీపీ ప్రభుత్వం రూ.74 కోట్లతో మంజూరు చేసిన ఈ బ్రిడ్జి పనులు వైఎస్సార్సీపీ పాలనలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేస్తోందని, మరో 20 రోజుల్లో రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.