ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని హోల్ సేల్ బాణాసంచా దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. నిల్వ కేంద్రం వద్ద పని చేసే స్థితిలో ఉన్న ఫైర్ ఎక్స్టింగూషర్లు ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వ ఉండాలని ఆదేశించారు. పరిమితికి మించి బాణా సంచాను నిల్వ చేయవద్దన్నారు.