GNTR: తెనాలి డివిజన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మారీసుపేటలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, మున్సిపల్ కార్మికులతో కలిసి పాల్గొని సమస్యలపై నినాదాలు చేశారు. లేబర్ కోడ్ అమలు చేయవద్దని, రద్దయిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.