E.G: ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. కొత్తపేట కళానగర్ వినాయకుని గుడిలో పూజలు జరిపించి కొత్తపేట నియోజక వర్గ ఎమ్మెల్యే సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సంజీవ్ పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు.