సత్యసాయి: సోమందేపల్లిలో 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు గురువారం రేషన్ డీలర్లు ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ చెప్పున విధంగా జూన్ 26 నుండి వృద్ధులకు, వికలాంగులకు ఇంటివద్దకే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు సోమందేపల్లి డీలర్ తూముకుంట బాలు తెలిపారు. ఇంటి వద్దనే రేషన్ బియ్యం అందించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.