ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలోని పోస్ట్ ఆఫీస్లో పోస్ట్మాన్గా పనిచేస్తున్న ప్రసన్న కుమార్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు గత ఆరు నెలలుగా ఉత్తరాలు, ఆధార్, పాన్, ఓటర్ కార్డులు, రిజిస్టర్డ్ పోస్టులను పంపిణీ చేయలేదు. దీంతో హనుమంతరావు ఫిర్యాదుతో గురువారం తపాలా ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేసి, మూడు బస్తాల్లో నిల్వ ఉన్న ఉత్తరాలను పరిశీలించారు.