ATP: పీఏబీఆర్ నుంచి నగరంలో నీటి సరఫరా చేసే పైప్లైన్ రచనపల్లి వద్ద లీకేజీ కారణంగా శుక్రవారం నీటి సరఫరా నిలిచిపోయింది. నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, డీఈ నరసింహులు లీకేజీ స్థలానికి వెళ్ళి పరిశీలించారు. సుమారు 8గంటల పాటు. శ్రమించి లీకేజీని గుర్తించి, మరమ్మత్తుల అనంతరం శనివారం యధావిధిగా నగరంలో నీటి సరఫరా చేస్తారని కమిషనర్ రంగస్వామి తెలిపారు.