SKLM: కేరళ ప్రజలకు అండగా నిలవాలని సీఐటీయూ జిల్లా సినీయర్ నాయకులు కె.శ్రీనివాసు అన్నారు. శ్రీకాకుళంలో సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం కేరళ సంఘీభావ సభను జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అధ్యక్షతన సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలందరూ ఖండించాలన్నారు.