E.G: జగన్తోనే క్రైస్తవుల అభివృద్ధి సాధ్యమని, మళ్లీ ఆయన నేతృత్వంలోనే ప్రభుత్వం వస్తుందని వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయ బుధవారం తెలిపారు. వైసీపీతోనే పాస్టర్లకు రూ.5,000 గౌరవ వేతనం కొనసాగించాలని కోరుతూ కొంతమూరులో పాస్టర్లు కె.ఏలియా, బి.ఎలీషా ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని విజయ సారథి హామీ ఇచ్చారు.