ఏలూరులోని CPI ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు పెట్రోల్ బంకుల్లో పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన దేశంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు బంకుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు.