కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పర్యటన వివరాలను మంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం కాజులూరులో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పార్టీ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు కాకినాడ రూరల్ వాకాడ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొంటారు. రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్తారని పేర్కొంది.