KMM: గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది నుంచి BBA(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) అనే కొత్త గ్రూప్ను చేర్చినట్లు ప్రిన్సిపల్ రజిత తెలిపారు. ఈ గ్రూప్లో అడ్మిషన్ పొందడానికి ఇంటర్లో 40% మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు దోస్త్ ద్వారా ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.