NDL: ఉయ్యాలవాడలో మహిళ ఔదార్యం చాటుకున్నారు. సాత్విక్, గౌతమ్ వేర్వేరు తల్లిదండ్రుల పిల్లలు. అయితే ఇద్దరికి సంబంధించిన తల్లికి వందనం డబ్బులు రూ. 26వేలు సాత్విక్ తల్లి కుమారి ఖాతాలో జమయ్యాయి. పొరపాటున పడిన డబ్బులు తనకు వద్దని ఆమె నిజాయితీ చాటుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో రూ.13వేల మొత్తాన్ని గౌతమ్ తల్లి పావనికి అందజేశారు