HYD: నగర రోడ్లపై వాహనాల సరాసరి వేగం గంటకు 24 కిలోమీటర్లకు పెరిగిందని HYD సీపీ ఆనంద్ శుక్రవారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. గతంలో 17-18 KMPH మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. ఆపరేషన్ రోప్, VIP, VVIP మూమెంట్ మేనేజ్మెంట్, 85 శాతం ఆటోమేటిక్ సిగ్నలింగ్, హై రైస్ బిల్డింగులపై సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో ట్రావెల్ ఈజీనెస్ పెరిగిందన్నారు.