రంగారెడ్డి: శంకర్ పల్లి మండలం జన్వాడలో వ్యవసాయ బోర్ల నుంచి అక్రమంగా నీటిని ట్యాంకర్లలో నింపి తరలిస్తున్న 6 లారీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ సురేందర్ నేతృత్వంలో సిబ్బంది దాడులు నిర్వహించి, వ్యవసాయేతర అవసరాలకు నీటిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, నీటి నిల్వ గుంతలను జేసీబీలతో కూల్చివేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.