KDP: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని అర్బన్ సీఐ నరేశ్ బాబు తెలిపారు. 31 రాత్రి 12:30 గంటల్లోపు వేడుకలు ముగించాలని, డీజేలు, టపాసులు నిషేధమన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్, రోడ్లు బ్లాక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.