KDP: పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాలను పురస్కరించుకొని ఈ నెల 13న ఉదయం 8 గంటలకు ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో గెలిచిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతిగా రూ.40 వేలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా వరుసగా తొమ్మిది బహుమతుల వరకు బహుమతులు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు.