VZM: బొండపల్లి MRO డోలా రాజేశ్వరరావు ఎదుట మంగళవారం మండలంలో బెల్ట్ షాపుల కేసుల్లో పట్టుబడిన 14 మంది, ఇద్దరు అనుమానిత నిర్వాహకులను ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. ఈ మేరకు BNSS చట్టం 129 ప్రకారం 14 మందిని, 128 ప్రకారం ఇద్దరిని.. సంవత్సరం కాల పరిమితికి రూ.2 లక్షల బాండ్లను సమర్పించి, బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై నరేంద్ర తెలిపారు.