NLR: కొడవలూరులోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హాజరైన విద్యార్థులు చేత గ్రంథాలయ అధికారి రాజేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు. పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంధాలయంలో ఉండే పుస్తకాలు చదవడం ద్వారా గొప్ప మేధావులు అవుతారని రాజేశ్వరి అన్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.