CTR: సదుం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చినేపల్లి ఆనంద(54) అస్వస్థతతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆయన రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనంద మృతికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.