VZM: ఈనెల 19వ తేదీ వరకు ఎస్కోట ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణా తరగతుల శిబిరాన్ని ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం ప్రారంభించారు. మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, మండల శాఖల అధికారులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటారని తెలిపారు.