SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో మంగళవారం శ్రీఅసిరి తల్లి గ్రామ దేవత పండగలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న పలు కుటుంబాలను కలిసి మాట్లాడారు.