KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగమ్మ అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.