ATP: 2009 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులంతా టెట్ అర్హత సాధించాలన్న విద్యాశాఖ ఉత్తర్వు సరైంది కాదని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. టెట్ మినహాయింపు రాష్ట్ర పరిధిలో లేదనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు.