ATP: గుత్తి మీదుగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి గురువారం సికింద్రాబాదులో బయలుదేరే రైలు (07009) డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల మీదుగా తిరుపతికి చేరుతుంది. తిరుగు రైలు (07010) శుక్రవారం బయలుదేరి అదే మార్గంలో సికింద్రాబాదుకు చేరుతుంది.