W.G: తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత అందిస్తున్నామని, వైద్య ఖర్చులు ఎక్కువైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.