విశాఖ: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు.