ప్రకాశం: పామూరు మండలం వగ్గం పల్లిలో ‘రైతన్న- మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. రైతులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇంకా నగదు జమకాకుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.