GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కే.సంజీవరావు మాట్లాడుతూ.. 12 కంపెనీలు ఈ మేళాలో పాల్గొని 54 ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తెలిపారు.