NDL: నందికొట్కూరు పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న అమ్మాయి లహరి ప్రేమాన్మాది చేతిలో మృతి చెందిన సందర్భంగా స్థానిక పటేల్ సెంటర్ నందు విద్యార్థులతో ర్యాలీగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా మాట్లాడుతూ.. దేశంలోనూ అలాగే రాష్టంలోను అనేక చోట్ల నిత్యం మహిళతో పాటు బాలిక హత్య చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలి.