కడప: గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు జిల్లా స్థాయి పరుగుపందెం (దూరపు పోటీ) పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాషా తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పోటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.