కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,39,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 227 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.