కాకినాడ జిల్లా డీఎస్పీ మనీష్ దేవరాజ్ మంగళవారం రాత్రి రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం సందర్శించారు. ఈ నెల 8న నిర్వహించనున్న కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా తెప్పోత్సవం వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్ల గురించి వివరించారు.