CTR: చౌడేపల్లె అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఉభయదారులుగా వ్యవహరించారు.