VSP: గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, ఎమ్మెల్యే కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే సంప్రదించి పరిష్కారం చూపించాలని ఆదేశించారు.