ELR: ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం నందు గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలుగా ముందుగా రక్తదానం చేయడం జరిగింది. తొలిత అంబేడ్కర్ విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు.