KRNL: శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు స్థానిక సత్రాలవారితో సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అన్ని సత్రాలు కూడా సేవాదృక్పథంతో భక్తులకు సేవలు అందించాలన్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, భక్తుల సదుపాయాల కల్పనలో అన్ని సత్రాల వారు కూడా సహకరించాలన్నారు. సత్ర ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.