కృష్ణా: కంకిపాడు మండలం కోలవెన్ను మండపాల కూడలిలోని వరసిద్ధి వినాయక గుడి ప్రాంగణంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. డీహెచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్ సహకారంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నేత్ర, దంత, పిల్లల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, నిపుణులు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు.