PPM: గరుగుబిల్లి మండలంలో గల నందివానివలస పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే జాగ్రత్తగా ఉంటూ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలన్నారు.