అనంతపురం: ధర్మవరంలో బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం బీజేపీలో చేరాయి. జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోలా రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశయాలు, మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు.