BPT: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో MLC వేపాడ చిరంజీవితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.