ప్రకాశం: కంభం పట్టణంలోని 1వ సచివాలయాన్ని ఎంపీడీవో వీరభద్రచారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.