ATP: తాడిపత్రి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఈ నెల 28న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. సంజీవ్ నగర్ ఆలయం వద్ద రూ.34 లక్షలతో అభివృద్ధి పనులు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర రూ. 18 లక్షల భూగర్భ డ్రైనేజీ, నంద్యాల రోడ్డులో రూ. 36 లక్షల తాగునీటి పైప్లైన్ పనులను ఆయన ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది.