ASR: ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న మన్యం బందును జయప్రదం చేయాలని గిరిజన సంఘ నాయకులు సూర్యనారాయణ పోతురాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో ఆదివారం కరపత్రాలు విస్తృతంగా పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.