TPT: రామచంద్రాపురం మండలం కేకేవీపురంలో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 9,611 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని, అందరికి వారి ఇంటి వద్దనే గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండదని పేర్కొన్నారు.