సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖకు చెందిన శక్తి టీమ్ బృందాలు పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం శక్తి టీమ్ సభ్యులు శక్తి యాప్, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలకు, మహిళలకు చట్టపరమైన సమాచారం అందించారు.