NLR: దుత్తలూరులోని సీడ్స్ సంస్థలో ఆదివారం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు జరుగుతాయని ఆ సంస్థ ప్రతినిధి చేజర్ల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో మండలస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఫైనల్ పోటీల్లో విజేతలైన వారికి నగదు బహుమతులు, షీల్డ్ అందజేస్తామని వెల్లడించారు.