అన్నమయ్య: జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేశ్ కృషితో రాజంపేటలో కన్యాకుమారి స్టాపింగ్ వచ్చిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ అన్నారు. ఒక రోజు ముందే మంగళవారం ట్రయిల్ కోసం రాజంపేటలో ట్రైన్ ఆగిందని ఆయన తెలిపారు. రైల్వే మంత్రి, సికింద్రాబాద్ రైల్వే నిలయం మేనేజర్ పద్మజను కలిసి లోకేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఆయన కృషి ఫలించిందని చెప్పారు.