కడప: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా టీపీ వెంకట సుబ్బమ్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం కడప నగర మేయర్ కె. సురేశ్ బాబను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకొని ధన్యవాదాలు తెలిపారు. ఆమెతో పాటు టీపీ దుర్గా ప్రసాద్, మాజీ సోషల్ మీడియా అధ్యక్షురాలు సునీత రెడ్డి ఉన్నారు.